Bangaram Dharalu

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బంగారం ధరలు రోజురోజుకు పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి. మగువలకు ప్రియమైన పసిడి ధరలు నిలకడగా ఎగసి, సరికొత్త ఆల్‌టైమ్ హై స్థాయిని చేరుతున్నాయి. లక్షన్నరకు చేరువగా పరుగులు పెడుతూ, కొనుగోలుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

మొదట వెండి ధర లక్ష మార్కును దాటగా, ఆ తర్వాత ఆభరణాల తయారీకి ఉపయోగించే స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర కూడా లక్ష రూపాయలను అధిగమించింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.771 పెరిగి, రూ.10,509 నుంచి రూ.11,280కి చేరుకుంది. ఇది కొనుగోలుదారులకు ఆలోచనకు తావిస్తోంది.

gold

 

అదే సమయంలో, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 పెరిగి, రూ.1,01,300 నుంచి రూ.1,02,000కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల పసిడి పట్ల ఆకర్షణను మరింత పెంచుతోంది, అయితే కొనుగోలు నిర్ణయాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పసిడి ధరలు ఇంకా ఎంత పెరుగుతాయోనని మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.